టోక్యో: ఒలింపిక్స్ రెండో రోజే సిల్వర్ మెడల్తో ఇండియాకు తొలి పతకాన్ని అందించిన వెయిట్లిఫ్టర్ మీరాబాయ్ చానుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీతోపాటు హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, ఢిల్లీ, తమిళనాడు, అస్సాం, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర క్రీడా ప్రముఖులు ట్విటర్లో ఆమెను ప్రశంసించారు. ఇండియాను సగర్వంగా తలెత్తుకునేలా చేశావంటూ ఆకాశానికెత్తారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్లిఫ్టింగ్లో ఇండియాకు మెడల్ సాధించిపెట్టిన అథ్లెట్గా మీరాబాయ్ నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో ఇండియా గెలిచిన అత్యుత్తమ పతకం ఇదే. దీంతో మీరాబాయ్ ఒక్కసారిగా స్టార్ అయిపోయింది.