న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ప్లేయర్ల ప్రతిభకు గుర్తింపు దక్కింది. పలు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టిన ప్లేయర్లను కేంద్ర క్రీడాశాఖ సముచిత రీతిలో గౌరవించింది. మంగళవారం రాష్ట్రపతి భవన్ వేదికగా కన్నుల పండువగా జరిగిన వార్షిక క్రీడా అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ప్లేయర్లకు అవార్డులు ప్రదానం చేశారు. వాస్తవానికి జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) రోజు అవార్డుల కార్యక్రమం జరుగాల్సి ఉన్నా.. ఆసియాగేమ్స్తో వాయిదా పడింది.
నిరుడు జరిగిన ఆసియాగేమ్స్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీకి ధ్యాన్చంద్ ఖేల్త్న్ర పురస్కారం దక్కింది. ప్రస్తుతం మలేషియా ఓపెన్లో ఆడుతున్నందున కార్యక్రమానికి వారు హాజరు కాలేకపోయారు. నిరుడు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్..రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.
మరోవైపు వన్డే ప్రపంచకప్లో 24 వికెట్లతో అదరగొట్టిన టీమ్ఇండియా స్పీడ్స్టర్ షమీ, చేతులు సరిగ్గా లేకపోయిన ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తున్న జమ్ముకశ్మీర్ ఆర్చర్ శీతల్దేవి, యువ గ్రాండ్మాస్టర్ వైశాలి, ఆంధ్ర అంధ క్రికెటర్ అజయ్కుమార్ రెడ్డి అతిథుల కరతాళ ధ్వనుల మధ్య అవార్డులు అందుకున్నారు. ఏషియన్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఆడుతున్న యువ షూటర్ ఇషాసింగ్ కార్యక్రమానికి హాజరుకాలేకపోయింది. ఖేల్త్న్ర అవార్డు కింద పురస్కారంతో పాటు 25 లక్షలు, అర్జున గ్రహీతలకు 15 లక్షల నగదు ప్రోత్సాహం దక్కింది. కోచ్ రమేశ్ను ద్రోణాచార్య అవార్డు వరించింది.