ముంబై: ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ.. తాజా ఐపీఎల్లో పెద్దగా పర్ఫార్మ్ చేయడంలేదు. ఆ జట్టు కూడా దాదాపు ప్లేఆఫ్స్కు దూరం అయ్యింది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఈసారి టోర్నీలో ఆకట్టుకోలేకపోయారు. ఒకవైపు రోహిత్ శర్మపై విమర్శలు వస్తున్నాయి. అతనికి అండగా నిలిచిన వ్యక్తులు కూడా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతీ జింతా(Preity Zinta) మాత్రం ముంబై బ్యాటర్పై ప్రశంసలు కురిపించారు. రోహిత్ గురించి ఓ మాట చెప్పాలంటే ఓ అభిమాని ఆమెను కోరారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. రోహిత్ శర్మ ప్రతిభకు పవర్హౌజ్ అంటూ ప్రీతీ కామెంట్ చేశారు.
ముంబై జట్టు ఈసారి టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే నెగ్గింది. ఇవాళ జరిగే మ్యాచ్లో ఆ జట్టు హైదరాబాద్తో తలపడనున్నది. ఆరు పాయింట్లతో ఉన్న ముంబై.. కనీసం మిగితా మూడు మ్యాచుల్లో నెగ్గేందుకు ప్రయత్నించనున్నది.
A powerhouse of talent. https://t.co/tOMq5p8Cxx
— Preity G Zinta (@realpreityzinta) May 6, 2024