కొత్తపల్లి, డిసెంబర్ 17: జాతీయ సబ్ జూనియర్ జూడో చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు సత్తాచాటారు. కొచ్చి వేదికగా జరుగుతున్న పోటీల్లో రాష్ర్టానికి చెందిన ప్రవీణ్కుమార్ 35 కేజీల విభాగంలో రజత పతకం కైవసం చేసుకోగా.. 30 కేజీల విభాగంలో శివ, 50 కేజీల విభాగంలో జంపయ్య కాంస్యాలు దక్కించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ జట్టు కోచ్, పెద్దపల్లి జిల్లా జోడో సంఘం కార్యదర్శి సిలివేరి మహేందర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, జనార్ధన్రెడ్డి, కైలాసం యాదవ్, కడారి అనంతరెడ్డి, అజీజ్, బాలరాజు, మిట్టపల్లి ప్రవీణ్కుమార్, సంజీవ్, సీహెచ్ రాము, నాగరాజు, రాజు, సాయిరాం యాదవ్, లింగమూర్తి, అబ్దుల్ బారి అభినందించారు.