BWF Rankings | న్యూఢిల్లీ: బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో భారత యువ షట్లర్లు సత్తాచాటారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రణయ్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 9వ ర్యాంక్కు చేరగా.. లక్ష్యసేన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ప్లేస్లో నిలిచాడు.
కిడాంబి శ్రీకాంత్ 19వ స్థానంలో ఉండగా.. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ కెరీర్ అత్యుత్తమ రెండో ర్యాంక్లో కొనసాగుతున్నది. గాయం నుంచి కోలుకున్న అనంతరం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న డబుల్ ఒలింపియన్ పీవీ సింధు.. 17వ స్థానంలో నిలిచింది. మహిళల డబుల్స్లో నిలకడ కనబరుస్తున్న గాయత్రి-త్రిసా జోడీ రెండు ర్యాంక్లు మెరుగై 17వ ర్యాంక్కు చేరింది.