హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో తెలంగాణ స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ (2021) గార్లపాటి పణీత పాల్గొంది. జూబ్లీహిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్క్లో గురువారం పణీత మొక్కలు నాటింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడమే కాకుండా.. నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగిస్తుండటం గొప్ప విషయమని పేర్కొంది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి అందాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అంది. అనంతరం కోచ్ రమేష్కుమార్, చంద్రశేఖర్ కుములి, మధు వర్షిణికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరింది.