సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 24: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్పై ఉన్న అభిమానాన్ని తనదైన శైలిలో చాటుకున్నాడు సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్. సచిన్ టెండూల్కర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సచిన్ దంపతుల చిత్రంతో రూపొందించిన పట్టు వస్ర్తాన్ని సోమవారం సచిన్ స్నేహితుడు, మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్కు అందజేశారు.
20 రోజలపాటు మగ్గంపై శ్రమించి 47 ఇంచుల వెడల్పు, 60 ఇంచుల పొడవు గల వస్ర్తాన్ని వెండి పట్టు దారాలను వినియోగించి నేసినట్లు హరిప్రసాద్ తెలిపారు. 170 వెండి పట్టు దారాలతో నేసిన ఈ చీర బరువు 290 గ్రాములు ఉంటుందని చెప్పారు. క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్కు తాను వీరాభిమానన్నాడు. గోవాలో జరిగే జన్మదిన వేడుకలలో చాముండేశ్వరీనాథ్ పాల్గొని సచిన్కు ఈ పట్టు వస్ర్తాన్ని అందజేస్తారని తెలిపారు.