రావల్పిండి : పాకిస్థాన్తో ముగిసిన అయిదు మ్యాచ్ల టి20 సిరీస్ను న్యూజిలాండ్ సమం చేసింది. సోమవారం జరిగిన అయిదవ, చివరి మ్యాచ్లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మార్క్ చాపమన్(104 నాటౌట్) సెంచరీతో జట్టును గెలిపించాడు.
తొలుత పాకిస్థాన్ 5 వికెట్లకు 193 పరుగులు చేయగా, ఛేదనలో కివీస్ 4 వికెట్లకు 194 పరుగులు చేసి గెలిచింది. పాక్ జట్టులో ఓపెనర్ రిజ్వాన్ 98 పరుగులతో నాటౌట్గా నిలవగా, ఇఫ్తికార్ అహ్మద్ 36, వాసిం 31 పరుగులతో పర్వాలేదనిపించారు. టిక్నర్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. కివీస్ జట్టులో చాప్మన్ సెంచరీతో అజేయంగా నిలవగా, జేమ్స్ నీషమ్ 45(నాటౌట్) పరుగులు చేశాడు.