Akash Chopra : టీ20 వరల్డ్ కప్లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ దక్షిణాఫ్రికా లీగ్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ (ఎంఐసీటీ) జట్టుకు ఆడుతున్న అతను బ్యాటింగ్, బౌలింగ్లోనూ ఆకట్టుకోవడం లేదు. ఆ ఆల్రౌండర్ ఆట తీరు ఎంఐసీటీ జట్టునే కాదు పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీని కూడా కలవరపెడుతోందని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా లీగ్లో సామ్ కరన్ ఇప్పటివరకూ స్థాయి తగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రస్తుతం అతను ఎంఐసీటీకి ఆడుతున్నాడు. అయితే.. ఐపీఎల్ వేలంలో కరణ్ను పంజాబ్ కింగ్స్ భారీ ధరకు కొన్నది. టోర్నీలోపు అతను ఫామ్ అందిపుచ్చుకోవాలని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కోరుకుంటోంది’ అని చోప్రా వెల్లడించాడు.
ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చి పొట్టి ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఛాంపియన్గా నిలిచింది. పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో సామ్ కరన్ మూడు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. దాంతో, కొచ్చిలో డిసెంబర్ 23న జరిగిన మినీ వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ అతడి కోసం రూ.18.50 కోట్లు పెట్టింది. దాంతో, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అతను గుర్తింపు సాధించాడు. పోయిన ఏడాది అతను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. త్వరలోనే ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది.