పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకట్టుకున్నాడు. అర్థశతకంతో అదరగొట్టాడు. బట్లర్ (30), శాంసన్ (23) తక్కువ స్కోర్లకే వెనుతిరగడంతో.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత భుజాలకెత్తుకున్న అతను చూడచక్కని షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే రాహుల్ చాహర్ వేసిన 12వ ఓవర్లో సింగిల్తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అతను రాణించడంతో రాజస్థాన్ జట్టు 12 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.