పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల టార్గెట్ను రాజస్థాన్ బ్యాటర్లు ఛేదించారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (68), జోస్ బటర్లర్ (30) జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (23) కాసేపు మెరుపులు మెరిపించాడు.
దేవదత్ పడిక్కల్ (31) నిదానంగా ఆడినా కూడా ఇన్నింగ్స్ నిర్మిస్తూ.. ఎదుటి బ్యాటర్లకు చక్కని సహకారం అందించాడు. చివర్లో హెట్మెయర్ (31 నాటౌట్) ధాటిగా ఆడటంతో రాజస్థాన్ సునాయాస విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా.. రబాడ, రిషి ధవన్ చెరో వికెట్ తీసుకున్నారు.
That's that from Match 52 as @rajasthanroyals win by 6 wickets.#TATAIPL #PBKSvRR pic.twitter.com/RloiU9m1LJ
— IndianPremierLeague (@IPL) May 7, 2022