రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు రాణించారు. ఓపెనర్గా వచ్చిన బెయిర్స్టో (56) అద్భుతమైన ఆటతీరుతో అలరించాడు. ధవన్ (12), మయాంక్ అగర్వాల్ (15) నిరాశపరిచినా కూడా.. రాజపక్స (27), లియామ్ లివింగ్స్టన్ (22), జితేష్ శర్మ (38 నాటౌట్) రాణించారు.
చివర్లో రిషి ధవన్ (5 నాటౌట్) కూడా బౌండరీ బాదాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు.