పంజాబ్పై అద్భుతంగా రాణించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (68) అవుటయ్యాడు. పంజాబ్ యువ పేసర్ అర్షదీప్ సింగ్ వేసిన 15వ ఓవర్ రెండో బంతికి జైస్వాల్ పెవిలియన్ బాటపట్టాడు. అర్షదీప్ వేసిన లెంగ్త్ డెలివరీని లాంగాఫ్ మీదుగా సిక్సర్ కొట్టేందుకు జైస్వాల్ ప్రయత్నించాడు. అయితే బంతి అతను అనుకున్నంత దూరం వెళ్లలేదు కానీ.. ఎత్తుగా లేచింది.
దీంతో లాంగాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న లివింగ్స్టోన్ సులభంగా క్యాచ్ పట్టేశాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్.. జట్టు స్కోరు 141 వద్ద మూడో వికెట్ రూపంలో మైదానం వీడాడు.