పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (25) మరోసారి తనకు దక్కిన శుభారంభాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించిన అతను.. తర్వాత భారీ షాట్లు ఆడుతూ అలరించాడు. ఈ క్రమంలోనే ఐదో ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదాడు.
అదే ఓవర్ నాలుగో బంతికి చమీర బౌలింగ్లో మరో బౌండరీ కోసం ప్రయత్నించాడు. మిడాఫ్ మీదుగా బంతిని తరలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ క్యాచ్ అందుకున్నాడు. దీంతో మయాంక్ ఇన్నింగ్స్ ముగిసింది. జట్టు స్కోరు 35 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది.