లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు తడబడుతున్నారు. మయాంక్ అగర్వాల్ (25), శిఖర్ధవన్ (7) తర్వాత కీలకమైన రాజపక్స (9) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపు మెరుపులు మెరిపించిన లియామ్ లివింగ్స్టన్ (18) కూడా పదమూడో ఓవర్లో అవుటయ్యాడు. ఆ ఓవర్ తొలి బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించిన లివింగ్స్టన్.. కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
దీంతో క్రిజులోకి వచ్చిన జితేష్ శర్మ (2) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. కృనాల్ పాండ్యా వేసిన 14వ ఓవర్ రెండో బంతిని డిఫెండ్ చేసుకోవడానికి అతను ప్రయత్నించాడు. అయితే బంతి అతని ప్యాడ్లను తాకడంతో లక్నో జట్టు అప్పీల్ చేసింది. బంతి ముందుగా ప్యాడ్ను తాకిందా? లేక బ్యాట్ను తాకిందే తెలియకపోవడంతో అంపైర్ స్పందించలేదు.
దీంతో లక్నో కెప్టెన్ రాహుల్ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి ముందుగా ప్యాడ్నే తాకినట్లు తేలింది. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో జితేష్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పంజాబ్.. విజయానికి ఇంకా 62 పరుగుల దూరంలో నిలిచింది.