చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధవన్ (51 నాటౌట్) అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ (18) వికెట్ పోవడంతో తడబడిన బ్యాటింగ్ లైనప్ను భానుక రాజపక్సతో కలిసి చక్కదిద్దే బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు.
ఈ క్రమంలోనే 14వ ఓవర్ ఐదో బంతికి బౌండరీ బాదిన ధవన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ధవన్ హాష్ సెంచరీ చేయడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.