న్యూఢిల్లీ: దక్షిణకొరియా వేదికగా జరుగుతున్న ఆసియా-ఓషియానియా పారా పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత లిఫ్టర్లు పరమ్జీత్ కుమార్, మన్ప్రీత్కౌర్ కాంస్య పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన పురుషుల 49కిలోల విభాగంలో బరిలోకి దిగిన పరమ్జీత్ 163 కిలోలు ఎత్తి అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. ఒమర్ ఖరాద(175కి), లీ వాన్ కాంగ్(173కి) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. మహిళల ఫైనల్లో మన్ప్రీత్కౌర్ 88కిలోలు ఎత్తి కాంస్యం దక్కించుకుంది. లింగ్లింగ్(111కి), నెనాంగ్(99కి) పసిడి, వెండి పతకాలు ఖాతాలో వేసుకున్నారు.