బెంగళూరు: డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో యూపీ యోధా జట్టు పరాజయం పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా సోమవారం జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ 32-29తో యూపీ యోధాపై విజయం సాధించింది. జైపూర్ కెప్టెన్ దీపక్ హూడా 9 పాయింట్లు సాధించగా.. అర్జున్ 11 పాయింట్లతో సత్తాచాటాడు. మరోవైపు యూపీ యోధా స్టార్ రైడర్ పర్దీప్ (3 పాయింట్లు) విఫలం కాగా.. సురేందర్ (10 పాయింట్లు) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. తలైవాస్, యూ ముంబా మధ్య జరిగిన మరో మ్యాచ్ 30-30తో డ్రాగా ముగిసింది.