హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు క్రీడల్లో సత్తాచాటుతూనే ఉన్నారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న 5వ ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ చాంపియన్షిప్లో పారా అథ్లెట్ రవికిరణ్ కాంస్య పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో(ఎఫ్-37) విభాగంలో బరిలోకి దిగిన రవికిరణ్..జావెలిన్ను 32.88 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఈ యువ అథ్లెట్ ప్రదర్శనను జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్తో పాటు షాజి, నాగరాజు అభినందించారు.