ముంబై: గాయపడ్డ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వరల్డ్కప్లో నెదర్లాండ్స్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ వరకు కూడా అందుబాటులోకి వచ్చేది అనుమానంగానే ఉంది. నవంబర్ 12న జరిగే ఆ మ్యాచ్ వరకు అతన్ని పక్కనపెట్టే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ పాండ్యా గాయపడ్డ విషయం తెలిసిందే. అతని మడిమకు గాయమైంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్తో జరిగిన కీలక మ్యాచ్లను అతను మిస్సయ్యాడు. రేపు శ్రీలంక, 5న సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్లకు కూడా పాండ్యా ఆడేది అనుమానంగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.
నవంబర్ 12వ తేదీన బెంగుళూరులో నెదర్లాండ్స్తో ఇండియా చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నది. అయితే ఆ చివరి మ్యాచ్కు అతను అందుబాటులోకి వచ్చే ఛాన్సు ఉన్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. పాండ్యాకు స్వల్ప స్థాయి గాయమైందని, దాని నుంచి అతను కోలుకుంటున్నట్లు చెప్పాడు. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పాండ్యా కోలుకుంటున్నాడని, అతని భవిష్యత్తు గురించి మరికొన్ని రోజుల్లో ప్రకటన వస్తుందని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు.