టీ20 ప్రపంచకప్లో భాగంగా సూపర్ 12 మ్యాచ్లో ఇవాళ పాకిస్థాన్, నమీబియా మధ్య పోరు త్వరలో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నమీబియా ఫీల్డింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ అబుదబి స్టేడియంలో జరగనుంది. పాకిస్థాన్ టీమ్లో ఎటువంటి మార్పులు లేవు.
పాకిస్థాన్ టీమ్లో బాబర్ ఆజమ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఫకర్ జమాన్, మహమ్మద్ హఫీజ్, సోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసిమ్, హసల్ అలీ, హరిశ్ రవుఫ్, షాహీన్ షా అఫ్రిది బరిలో ఉన్నారు.
నమీబియా జట్టు నుంచి స్టీఫన్ బార్డ్, మైకెల్ వాన్ లింగెన్, క్రేగ్ విలియమ్స్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), డేవిడ్ వీయెసె, జేజే స్మిత్, జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), జాన్ ఫ్రైలింక్, రుబెన్ ట్రంపెల్మాన్, బెన్ షికాంగో బరిలో ఉన్నారు.
గ్రూప్ 2 పాకిస్థాన్ ఇప్పటికే టాప్లో ఉంది. 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో టాప్ పొజిషన్లో ఉంది. నమీబియా ఆడిన రెండు మ్యాచ్లలో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. నమీబియాకు సెమీస్ బెర్త్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచినా కూడా నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉండటం వల్ల సెమీస్లోకి వెళ్లడం దాదాపు అసాధ్యం. పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ బెర్త్ను కన్ఫమ్ చేసుకుంది.