పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగిన మొదటి మ్యాచ్ గుర్తుందా. ఆ మ్యాచ్లో పాక్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రిజ్వాన్, ఆజమ్ ఇద్దరే ఆడి పాక్ను గెలిపించారు. ఈరోజు మ్యాచ్ చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఓపెనర్లు రిజ్వాన్, ఆజమ్.. ఇద్దరే గత 8 ఓవర్ల నుంచి ఆడుతున్నారు.
అయితే.. నమీబియా బౌలర్లు కూడా టఫ్ బౌలింగ్ వేస్తున్నారు. రుబెన్ అయితే 2 ఓవర్లు వేసి కేవలం 2 పరుగులే ఇచ్చాడు. మొత్తానికి 8 ఓవర్లలో పాకిస్థాన్ చేసిన స్కోరు 45. నిజానికి పాక్ గత మ్యాచ్ల స్కోర్తో చూస్తే చాలా తక్కువ. పసికూన అయినా కూడా నమీబియా.. పాక్ను తమ బౌలింగ్తో బాగానే కట్టడి చేస్తోంది. ఆజమ్.. 27 బంతుల్లో 33 పరుగులు చేయగా.. రిజ్వాన్ 21 బంతుల్లో 12 పరుగులు చేశాడు.