ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు(Pakistan Cricket Team) మిలిటరీ శిక్షణ తీసుకుంటోంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ నేతృత్వంలో ఆ బృందం కఠోర విన్యాసాలు చేస్తోంది. కాకుల్లో ఉన్న ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్లో రెండు వారాల పాటు పాక్ క్రికెట్ జట్టు మిలిటరీ డ్రిల్స్ చేపట్టనున్నది. పాకిస్థాన్ ఆర్మీతో ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేసేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఆర్మీ వద్ద శిక్షణ పొందుతున్న క్రికెటర్ల వీడియోను పీసీబీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
కొన్నాళ్ల నుంచి పాక్ క్రికెట్ జట్టులో అసమ్మతి రగులుతోంది. రెండు రోజుల క్రితమే టీ20 కెప్టెన్ షహీన్ అఫ్రిదిని తొలగించారు. అతని స్థానంలో మళ్లీ బాబర్ను కెప్టెన్గా ఎన్నుకున్నారు. రెండు నెలల్లో టీ20 వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో ఈ మార్పు చేశారు. ఆర్మీ క్యాంపులో శిక్షణ పొందుతున్న క్రికెటర్లలో బాబర్ ఆజమ్, రిజ్వాన్, సయిమ్ అయూబ్, ఫకర్ జమాన్, సాహిబ్జాదా ఫర్హన్, హసీబుల్లా, సౌద్ షకీల్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హరిస్, సల్మాన్ అలీ ఆఘా, ఆజమ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మాద్, ఇర్ఫాన్ ఖాన్ నియాజి, షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసిమ్, ఉసామా మీర్, మహమ్మద్ నవాజ్, మెహ్రన్ ముంతాజ్, బ్రార్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, హసన్ అలీ, మొహమ్మద్ అలీ, జమాన్ ఖాన్, మహమ్మద్ వసీం జూనియర్, ఆమిర్ జమాల్, హరీస్ రౌఫ్, మహమ్మద్ ఆమిర్ ఉన్నారు.
📹 A candid peek into the Pakistan team’s training at the Army School of Physical Training (ASPT), Kakul 🏃#PAKvNZ | #BackTheBoysInGreen pic.twitter.com/d2DRn9miie
— Pakistan Cricket (@TheRealPCB) March 31, 2024