దుబాయ్: టీ20 వరల్డ్కప్లో ఆదివారం జరిగే ఉత్కంఠ పోరుకు రంగం సిద్దమైంది. గ్రూప్-2లో ఇండియా, పాకిస్థాన్ తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఆ హై వోల్టేజీ మ్యాచ్ కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు.. కోహ్లీ సేనతో ఢీకొట్టనున్నది. పాక్ జట్టులో ఆడే ఆటగాళ్ల లిస్టును రిలీజ్ చేశారు. రేపటి మ్యాచ్లో పాకిస్థాన్ జట్టులో చోటుదక్కిన వారిలో రిజ్వాన్, ఫకర్, హఫీజ్, మాలిక్, ఆసిఫ్, ఇమాద్, షాదాబ్, హసన్, షాహీన్, హారిస్, హైదర్లు ఉన్నారు.
గతంలో పాకిస్థాన్ ఓ సారి టీ20 వరల్డ్కప్ను గెలుచుకున్నది. 2009లో ఆ జట్టు కప్ను సొంతం చేసుకున్నది. ఇక ఈసారి ఆ టీమ్ తన తొలి మ్యాచ్లోనే బలమైన ప్రత్యర్థి, దాయాది భారత్తో పోటీపడుతోంది. బాబర్ ఆజమ్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీలు ప్రధాన బ్యాటర్లుగా బరిలోకి దిగుతున్నారు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో ఇమాద్, హఫీజ్, షోయెబ్, షాదాబ్లు ఉన్నారు. రిజ్వాన్కు కీపింగ్ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇక ప్రధాన బౌలర్లుగా హరిస్ రౌఫ్, హసన్ అలీ, షాహీన్ షా అఫ్రిదీలు ఉంటారు. షాహీన్ 12వ స్థానంలో ఉన్నాడు.