షార్జా: పసికూన స్కాట్లాండ్పై కూడా పాక్ విజయకేతనం ఎగరేసింది. గ్రూప్ దశలో ఒక్క ఓటమీ లేకుండానే సెమీస్లో అడుగుపెట్టింది. 190 పరుగుల లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్లు జార్జ్ మున్సే (17), కైల్ కోట్జర్ (9)తోపాటు మాథ్యూ క్రాస్ (5), డిలన్ బడ్జ్ (0) ఏమాత్రం సత్తా చాటలేదు.
రిచీ బెర్రింగ్టన్ (54 నాటౌట్) రాణించాడు. మైకేల్ లీస్క్ (14), క్రిస్ గ్రీవ్స్ (4) కూడా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి స్కాట్లాండ్ జట్టు 117/6తో ఇన్నింగ్స్ ముగించింది. విజయానికి 72 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ విజయంతో గ్రూప్-2 టాపర్గా నిలిచిన పాకిస్థాన్.. నవంబరు 10న దుబాయ్లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.