హైదరాబాద్: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల టెన్నిస్ టోర్నీలో ఉస్మానియా జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్లో ఉస్మానియా ప్లేయర్ శ్రీవల్లి రష్మిక 6-0, 6-0 తేడాతో లావణ్యపై అలవోక విజయం సాధించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వని రష్మిక వరుస సెట్లలో మ్యాచ్ను కైవసం చేసుకుంది. అదే జోరు కొనసాగిస్తూ మహిళల డబుల్స్లో ఉస్మానియా ద్వయం రష్మిక, సామ సాత్విక 6-0, 6-0తో టింటు, శరణ్య జోడీపై సునాయాస విజయం సాధించింది.