Neeraj Chopra | ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచిన నీరజ్ చోప్రాను రెండు పురస్కారాలు వరించాయి. పరమ్ విశిష్ఠ్ సేవా పురస్కారంతో పాటు పద్మశ్రీ పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డులలో ఆయన పేరును ప్రకటించింది. అంతకుముందే నీరజ్ చోప్రాకు పరమ్ విశిష్ఠ్ సేవా పురస్కారాన్ని ప్రకటించారు.
తనకు ఈ పురస్కారాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందజేయనున్నారు. ఒలింపిక్స్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి అథ్లెట్ నీరజ్. అందుకే.. ఆయనకు పరమ్ విశిష్ఠ్ సేవా పురస్కారాన్ని అందజేయనున్నారు. 2021 ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో భారత్కు నీరజ్ గోల్డ్ మెడల్ అందించాడు.
రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 384 మంది డిఫెన్స్ పర్సనల్కు గ్యాలంట్రీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అందులో 12 శౌర్య చక్ర అవార్డులు, 29 పరమ్ విశిష్ఠ్ సేవా మెడల్స్, 4 ఉత్తమ్ యుధ్ సేవా మెడల్స్, 53 అతి విశిష్ఠ్ సేవా మెడల్స్, 12 యుధ్ సేవా మెడల్స్, 3 విశిష్ఠ్ సేవా మెడల్స్ ఉన్నాయి.