IND vs BAN | హ్యాట్రిక్ విజయాల తర్వాత వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు గురువారం బంగ్లాదేశ్తో తలపడనుంది. పూణే వేదికగా జరగాల్సి ఉన్న ఈ మ్యాచ్లో భారత తుది జట్టు ఎలా ఉండనుంది..? టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీలు బంగ్లాతో పోరులో బరిలోకి దిగుతారా..? తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసుకోనున్నాయి..? అనే విషయాలపై టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే స్పందించాడు.
బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు బుధవారం నిర్వహించిన ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మంబ్రే మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీలో మేం ప్రారంభించిన జైత్రయాత్రను కొనసాగించడం ముఖ్యం. కావున ఇప్పటికైతే తుది జట్టులో రొటేషన్ పాలసీ వంటిదైతే ఏమీలేదు. గతవిజయాలను కొనసాగిస్తూ తర్వాత మ్యాచ్లలోనూ రాణించడం కీలకం. ఇప్పటికైతే మాకు తుదిజట్టులో మార్పులు చేసే అవసరమైతే లేదు..’ అని స్పష్టం చేశాడు.
కాగా గతంలో స్పిన్తో పాటు బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్గా ఉన్న పూణేలో వరల్డ్ కప్ కోసం కొత్త పిచ్ను రూపొందించారు. అయితే ఇది ఎలా స్పందిస్తుందనేది మిస్టరీగానే ఉంది. ఒకవేళ స్పిన్కు అనుకూలిస్తే కుల్దీప్ యాదవ్తో పాటు రవిచంద్రన్ అశ్విన్నూ ఆడిస్తారని వార్తలు వచ్చాయి.
అంతేగాక అశ్విన్తో పాటు బంగ్లాదేశ్తో మ్యాచ్లో పేసర్ జస్ప్రిత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీకి అవకాశమివ్వనున్నారని గుసగుసలు వినిపించాయి. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇవ్వకున్నా శార్దూల్ ఠాకూర్ను అయినా పక్కనబెట్టి షమీని ఆడిస్తారని వార్తలు వచ్చాయి. కానీ మంబ్రే మాత్రం వాటిని కొట్టిపారేశాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో కూడా భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పకనే చెప్పాడు.
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా అశ్విన్.. స్పిన్కు అనుకూలంగా ఉండే చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆడాడు. కానీ ఆ తర్వాత అఫ్గానిస్తాన్, పాకిస్తాన్తో మ్యాచ్లలో మాత్రం అతడిని పక్కనబెట్టింది టీమిండియా. షమీ ఈ వరల్డ్ కప్లో ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
బంగ్లాదేశ్తో పోరుకు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్