ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్లో ఆఖరి లీగ్ మ్యాచులో శ్రీలంక తడబడుతోంది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి మూడు కీలక వికెట్లు కోల్పోయింది. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో ట్రెంట్ బౌల్ట్ విజృంభించడంతో.. ఒకే ఓవర్లో కెప్టెన్ కుశాల్ మెండిస్(6), సమరవిక్రమ (1) ఔటయ్యారు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ పథుమ్ నిస్సంక(2) ను టిమ్ సౌథీ పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం కుశాల్ పెరీర(21), అసలంక(2) ఆడుతున్నారు. 5 ఓవర్లకు లంక స్కోర్.. 30/3
టాస్ గెలిచిన విలియమ్సన్ బౌలింగ్ తీసుకున్నాడు. చావోరేవో లాంటి ఈ పోరులో కివీస్ ఇష్ సోధీ స్థానంలో లూకీ ఫెర్గూసన్ను ఆడిస్తోంది. ఇక పరువు కోసం పోరాడనున్ను కుశాల్ మెండిస్ సేన కసున్ రజిత స్థానంలో చమిక కరుణరత్నేను తీసుకుంది.