టీ20 ప్రపంచకప్లో రసవత్తర మ్యాచ్కు వేదిక సిద్ధమైంది. అబుధాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ఈ ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ నెగ్గాడు. తర్వాత మంచు కురిసే అవకాశం ఉన్నందున ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు విలియమ్సన్ చెప్పాడు.
2019 ప్రపంచకప్ ఫైనల్లో బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలిన ఫీల్డర్ త్రో కారణంగా కివీస్ కప్పు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మ్యాచ్లో రెండు జట్ల స్కోర్లు సమంగా నిలిచాయి. సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో బౌండరీల సంఖ్య ఆధారంగా విజేతను ప్రకటించారు. ఆ తర్వాత ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న కీలకమైన పోరు ఇదే కావడం గమనార్హం.
న్యూజిల్యాండ్: మార్టిన్ గప్తిల్, డారియల్ మిచెల్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్
ఇంగ్లండ్: జోస్ బట్లర్, జానీ బెయిర్స్టో, డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్స్టన్, మొయీన్ అలీ, శామ్ బిల్లింగ్స్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్.