క్రైస్ట్చర్చ్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. కివీస్ నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. చేతిలో ఆరు వికెట్లు ఉన్న కంగారూలు విజయానికి 202 పరుగుల దూరంలో ఉన్నారు. స్మిత్(9), ఖవాజ (11), లబుషేన్ (6), గ్రీన్ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. హెడ్ (17), మిచెల్ మార్ష్ (27) క్రీజులో ఉన్నారు.
హెన్రీ(2-37), సీయర్స్ (2-22) రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 134-2 రెండో ఇన్నింగ్స్కు దిగిన కివీస్ 372 పరుగులకు ఆలౌటైంది. లాథమ్ (73), రచిన్ రవీంద్ర (82), మిచెల్(58) అర్ధసెంచరీలతో రాణించారు. కమిన్స్ (4-62), లియాన్ (3-49) ఆకట్టుకున్నారు.