న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్, హైదరాబాదీ ఇషా సింగ్ ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్/పిస్టల్ వరల్డ్ కప్లో రెండు ఈవెంట్లలో.. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ మూడు విభాగాల్లో బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీ కోసం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆదివారం 22 మంది షూటర్లతో కూడిన బలమైన జట్టును ప్రకటించింది.
భాకర్ మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్, 25 మీ.్ల పిస్టల్ వ్యక్తిగత విభాగాలతో పాటు 10 మీ. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ బరిలోకి దిగనుంది. ఇషారెండు వ్యక్తిగత పిస్టల్ ఈవెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సీజన్లో భారత టాప్ షూటర్లు విదేశీ గడ్డపై ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే కావడం విశేషం. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా ఈ నెల 26నుంచి జరిగే వరల్డ్ కప్లో రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బాబుటా, ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుసాలే వంటి అగ్రశ్రేణి షూటర్లు ఉన్నారు.