హైదరాబాద్, ఆట ప్రతినిధి: పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎన్ఈఆర్) చాంపియన్గా నిలిచింది. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన ఈ టోర్నీలో 18 జట్లు పోటీపడగా.. 7 పాయింట్లు సాధించిన ఎన్ఈఆర్ అగ్రస్థానం దక్కించుకుంది.
నార్తన్ రీజియన్ రన్నరప్గా నిలిచింది. వ్యక్తిగత విభాగాల్లో అంజన్సేన్, మీనాక్షి మాలిక్ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పవర్గ్రిడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ విజేతలకు ట్రోఫీలు అందించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్, సంజయ్, హరినారాయణన్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.