Rahul Dravid : రెండో టీ20లో భారత జట్టు ఓటమికి నోబాల్స్ కారణం అంటూ మాజీలు, ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా ఏ ఫార్మాట్లోనైనా నోబాల్స్ మ్యాచ్ను చేజార్చుతాయని మ్యాచ్ అనంతరం అన్నాడు. అయితే.. ఎవరూ కావాలని నోబాల్స్ వేయరని, కుర్రాళ్ల మీద ఆవేశపడొద్దడాని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిమానులకు సూచించాడు. ‘ఎవరూ కూడా వైడ్స్, నో బాల్స్ వేయాలని అనుకోరు. ముఖ్యంగా టీ20ల్లో. వాళ్లు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్లో మెరుగవ్వడం అనేది కష్టమైన దశ. అందుకని అందరూ ఓపికగా ఉండాలి’ అని ద్రవిడ్ తెలిపాడు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లు 7 నో బాల్స్ వేశారు. అర్షదీప్ సింగ్ ఏకంగా 5 నోబాల్స్ వేశాడు. తొలి ఓవర్లో మూడు, ఆఖరి ఓవర్లో రెండు నో బాల్స్ వేయడం శ్రీలంకకు కలిసొచ్చింది. శివం మావి, ఉమ్రాన్ మాలిక్ తలా ఒక నో బాల్ వేశారు.
పూణేలో జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 స్కోర్ చేసింది. కుశాల్ మెండిస్ (52), దాసున్ శనక (56) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఛేజింగ్లో భారత టాపార్డర్ విఫలమైంది. రజిత ఒకే ఓవర్లో ఇషాన్, గిల్లను వెనక్కి పంపాడు. సూర్యకుమార్ యాదవ్ (51), అక్షర్ పటేల్ (65) చెలరేగి ఆడారు. చివర్లో శివం మావి (26) బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా 190 రన్స్ చేసింది. 16 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. దాంతో సిరీస్ సమయం అయింది. మూడో టీ20 జనవరి 7న జరగనుంది.