చెన్నై: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్య ఛేదనను కోల్కతా నైట్రైడర్స్ దూకుడుగా ఆరంభించింది. పవర్ప్లేలో ధనాధన్ బ్యాటింగ్తో 45 పరుగులు రాబట్టింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, నితీశ్ రాణా ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్నారు. మాదిరి లక్ష్య ఛేదనలో కోల్కతా స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తోంది. కుదురుకున్న జోడీని విడదీసేందుకు ముంబై బౌలర్లు శ్రమిస్తున్నారు. 8 ఓవర్లకు కోల్కతా వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(23), నితీశ్ రాణా(37) క్రీజులో ఉన్నారు.