న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇప్పటికే కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్న నిఖత్..బుధవారం జరిగే 52 కిలోల సెమీస్ బౌట్లో బ్రెజిల్ బాక్సర్ కరోలిన్ డీ అల్మెడాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇటీవలే స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీలో పసిడి పతకంతో మెరిసిన ఈ ఇందూరు బాక్సర్..మరోమారు సత్తాచాటాలని చూస్తున్నది.
ప్రపంచ చాంపియన్షిప్లో ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తున్న నిఖత్ అద్భుతమైన టెక్నికల్ గేమ్తో ఆకట్టుకుంటున్నది. పదునైన పంచ్లకు తోడు జాబ్స్, హుక్స్తో చెలరేగుతున్నది. ముఖ్యంగా క్వార్టర్స్లో బ్రిటన్ బాక్సర్పై పవర్ పంచ్లు కురిపిస్తూ రౌండ్ రౌండ్కు తన ఆధికాన్ని పెంచుకుంది. సెమీస్లోనూ అదే జోరు కొనసాగిస్తూ పసిడి పోరుకు అర్హత సాధించాలని చూస్తున్నది. మరోవైపు మనీష(57కి)..టెస్టా ఇర్మాతో తలపడనుండగా, పర్వీన్..అమీ బ్రాడ్హస్ట్(ఐర్లాండ్)తో పోటీకి దిగనుంది. భారత్ ఇప్పటి వరకు 11 ఎడిషన్లలో 36 పతకాలు దక్కించుకుంది.