హైదరాబాద్: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ దూసుకెళ్తోంది. రింగ్లో మెరుపులా కదులుతూ బలమైన పంచ్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నది. 50 కేజీల విభాగంలో తలపడుతున్న నిఖత్.. ఆదివారం 5-0 తేడాతో ఆఫ్రికా ఛాంపియన్ బోలమ్ రుమేసా (అల్జీరియా)ను చిత్తుచేసి ప్రీక్వార్టర్స్లో అడుగుపెట్టింది.
ఇవాళ ప్రీక్వార్టర్స్లో భాగంగా మెక్సికో బాక్సర్ పాట్రీషియా అల్వారెజ్ను కూడా 5-0 తేడాతో నిఖత్ చిత్తుచేసింది. పాట్రీషియా అల్వారెజ్పై ముష్ఠిఘాతాలు కురిపించిన నిఖత్ ఏకపక్షంగా విజయం అందుకుంది. ప్రత్యర్థికి దూరంగా ఉంటూ అవకాశం చిక్కనప్పుడల్లా ఎదురుదాడి చేసింది.