వెల్లింగ్టన్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పోరాడుతున్నది. తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్.. ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లకు 202 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 138/7తో ఆదివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ వేగంగా ఆడింది.
టాపార్డర్ విఫలమైన చోట కెప్టెన్ టిమ్ సౌథీ (49 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) టీ20 తరహా ఇన్నింగ్స్తో అదగరొట్టాడు. సారథి చూపిన బాటలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్.. ఇంగ్లండ్కు దీటుగా బదులిస్తున్నది. టామ్ లాథమ్ (83), కాన్వే (61) హాఫ్సెంచరీలతో రాణించగా.. కేన్ విలియమ్సన్ (25), నికోల్స్ (18) క్రీజులో ఉన్నారు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న న్యూజిలాండ్.. ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 24 పరుగులు వెనుకబడి ఉంది.