లండన్: ఇండియన్ టీమ్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత తమ టీమ్ పరిస్థితి ఎలా చెప్పుకొచ్చాడు. గెలిచిన తర్వాత న్యూజిలాండ్ అర్ధరాత్రి వరకూ సంబురాలు చేసుకున్నదని, అది చూసి తట్టుకోలేకపోయామని అతడు చెప్పడం విశేషం. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీతోపాటు కొన్ని డ్రింక్స్తో సెలబ్రేట్ చేసుకోవడం న్యూజిలాండ్ టీమ్కు అలవాటు. వారిని అలా చూడటం మాకు కష్టంగా అనిపించింది. అర్థరాత్రి 12 గంటల వరకూ సంబురాలు చేసుకున్నారు. తర్వాత గ్రౌండ్లోకీ వచ్చారు. వాళ్ల సంతోషాన్ని వ్యక్తం చేయడానికి పెద్ద అరుస్తుంటే అది మాకు సింహనాదంలా వినిపించింది. మేము ఆ పని చేయాలేకపోయామే అన్న బాధ మాలో ఉంది అని అశ్విన్ చెప్పాడు.
అయితే తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా అశ్విన్ నిలవడం అతనికి కాస్త ఊరట కలిగించే అంశం. ఇక ఎక్కువ రోజుల పాటు బయో బబుల్లో ఉండటం వల్ల తాము అనుభవించిన కష్టాలను కూడా వివరించాడు. చాలా రోజులుగా బయో బబుల్లో ఉన్నాం. ఇన్నాళ్ల తర్వాత మాకు బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దక్కింది. నేను ఓ కారు రెంట్కు తీసుకున్నాను. దేశం మొత్తం తిరుగుతున్నాను అని అశ్విన్ చెప్పడం విశేషం. ఈ బ్రేక్ తమకు చాలా ఉపయోగపడనున్నట్లు అతడు తెలిపాడు.