న్యూఢిల్లీ: భారతీయ సెయిలర్ నేహా థాకూర్(Neha Thakur).. ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ గెలిచింది. ఐఎల్సీఏ-4 ఈవెంట్లో ఆమె ఈ మెడల్ సొంతం చేసుకున్నది. చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఈ ఈవెంట్లో ఆమె ఈ మెడల్ను గెలుచుకున్నది. భోపాల్లోని నేషనల్ సెయిలింగ్ స్కూల్లో ఆమె సెయిలర్గా శిక్షణ పొందింది. ఈవెంట్లో ఆమె 32 పాయింట్లుతో రెండో స్థానంలో నిలిచింది. థాయిలాండ్కు చెందిన నొప్పసొరన్ కున్బూంజన్ స్వర్ణ పతకం గెలిచింది. సింగపూర్కు చెందిన కీరా మేరీ కార్లైల్ 28 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది.
Many congratulations to Neha Thakur on winning the #SilverMedal in the ILCA4 Girls, #Sailing event.
Let’s #Cheer4india 🇮🇳 #WeAreTeamIndia | #IndiaAtAG22 pic.twitter.com/ad9lILyWTc
— Team India (@WeAreTeamIndia) September 26, 2023
సెయిలింగ్లో ఇండియాకు మెడల్ దక్కడం ఇదే మొదటిసారి. ఐఎల్సీఏ-4 క్యాటగిరీలో మొత్తం 11 రేసులు ఉంటాయి. అయితే అయిదో రేసులో నేహాకు మరీ తక్కువ పాయింట్లు వచ్చాయి. ఆ రేసులో ఆమె కేవలం 5 పాయింట్లు మాత్రమే సాధించింది. మొత్తం 32 పాయింట్లతో ఆమె 27 స్కోరు సాధించింది.