ఢిల్లీ : భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా వచ్చే నెల 5న బ్రసెల్స్ (బెల్జియం)లో జరుగనున్న డైమండ్ లీగ్ (డీఎల్) ఫైనల్స్కు అర్హత సాధించాడు. ఈ సీజన్లో రెండు డీఎల్ (దోహా, లుసానె)లో మాత్రమే పాల్గొన్న నీరజ్.. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్స్కు వచ్చాడు. దోహాలో నాలుగో స్థానంతో 7 పాయింట్లు సాధించిన అతడు.. లుసానెలో రెండో స్థానంతో ఐదు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
గత గురువారం జురిచ్ వేదికగా ముగిసిన ఆఖరి డీఎల్ పోటీల్లో నీరజ్ పాల్గొనకపోయినా ఆ ఫలితాల అనంతరం వెల్లడించిన పాయింట్ల పట్టికతో తుదిపోరులో అతడు తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. శ్రీలంక అథ్లెట్ పతిరగె (39 పాయింట్లు) అగ్రస్థానంతో ఫైనల్స్కు అర్హత సాధించగా పీటర్సన్ అండర్సన్, కెశ్రాన్, థాంప్సన్, జులియస్ క్వాలిఫైడ్ లిస్ట్లో ఉన్నారు.