న్యూఢిల్లీ: ఆర్చరీ ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు పసిడి పతకంతో మెరిశారు. ఐర్లాండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఐశ్వర్య శర్మ, అదితి, ఏక్తా రాణితో కూడిన భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది.
గురువారం జరిగిన కాంపౌండ్ ఫైనల్లో భారత్ 214-212 తేడాతో అమెరికాపై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్కు ఇది రెండో బంగారు పతకం కావడం విశేషం. అంతకుముందు ప్రియాన్ష్-అవ్నీత్ జోడీ మిక్స్డ్టీమ్ కాంపౌండ్ విభాగంలో గోల్డ్ మెడల్ కొట్టింది.