లీస్టర్: ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు ముందు లీస్టర్షైర్తో జరుగుతున్న వామప్ మ్యాచ్ను భారత ఆటగాళ్లు సద్వినియోగ పరుచుకుంటున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (62; 11 ఫోర్లు), రవీంద్ర జడేజా (56 బ్యాటింగ్; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోవడంతో భారత్ శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది.
లీస్టర్ తరఫున బరిలోకి దిగిన భారత బౌలర్లు నవ్దీప్ సైనీ 3, కమలేశ్ నాగర్కోటి రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ 246/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. లీస్టర్ షైర్ 244 పరుగులకు ఆలౌటైంది. చేతిలో మూడు వికెట్లు ఉన్న భారత్.. ప్రస్తుతం 366 పరుగుల ఆధిక్యంలో ఉంది. జడేజాతో పాటు సిరాజ్ (1) క్రీజులో ఉన్నాడు.