హైదరాబాద్, ఆట ప్రతినిధి: వడోదరా వేదికగా జరిగిన యూటీటీ జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ కాంస్య పతకం సాధించాడు. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీస్లో స్నేహిత్, దివ్య చితాలె జోడీ 8-11, 7-11, 11-6, 13-11, 11-0తో చాంపియన్ ద్వయం మానవ్ థక్కర్, అర్చనా కామత్ చేతిలో ఓటమిపాలైంది.
అంతకుముందు జరిగిన క్వార్టర్స్లో స్నేహిత్, దివ్య జంట 8-11, 11-8, 9-11 12-10, 11-3తో ఆకాశ్పాల్, ప్రాప్తిసేన్ ద్వయంపై అద్భుత విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్లో శ్రీజ, స్నేహిత్ పోరు ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది.