వడోదరా: అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో వడోదరా వేదికగా 72వ జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్షిప్ మంగళవారం మొదలుకానుంది. ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు జరిగే టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి మొత్తం 31 జట్లు బరిలో ఉన్నాయి. పీకేఎల్ గత సీజన్లో మెరుపులు మెరిపించిన ప్లేయర్లతో పాటు సీనియర్లు టోర్నీలో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా టాప్-3 రైడర్లు ఆయాన్ లోచబ్, దేవాంక్ దలాల్, భరత్ హుడా, అశు మాలిక్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరితో పాటు గత పీకేఎల్ సీజన్లో 64 ట్యాకిల్ పాయింట్లతో అదరగొట్టిన దీపక్శంకర్(తమిళనాడు), ఆదిత్య షిండే(మహారాష్ట్ర), నితేశ్కుమార్(హర్యానా), అనిల్(హిమాచల్ప్రదేశ్), ఉదయ్ పార్తె(మధ్యప్రదేశ్) తమ రాష్ట్ర జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.