లక్నో: జాతీయ బాలికల సబ్జూనియర్ హ్యాండ్బాల్ టోర్నీలో తెలంగాణ పోరు ముగిసింది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్లో తెలంగాణ జట్టు 14-18 తేడాతో హర్యానా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగతా మ్యాచ్ల్లో ఆంధ్రప్రదేశ్ 21-16తో మహారాష్ట్ర హ్యాండ్బాల్ అకాడమీపై, మహారాష్ట్ర 15-11తో పశ్చిమబెంగాల్పై, మణిపూర్ 19-13తో మధ్యప్రదేశ్పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించాయి. మంగళవారం జరిగిన పోటీలకు జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టోర్నీలో పోటీపడుతున్న ఆయా జట్లకు చెందిన ప్లేయర్లను అభినందించారు. జగన్ మాట్లాడుతూ ‘క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా చూడాలి. కష్టపడే క్రీడాకారులకు తప్పకుండా భవిష్యత్ ఉంటుంది. పోటీల నిర్వహణకు అనుమతి ఇచ్చిన సాయ్తో పాటు భారత ఒలింపిక్ సంఘానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు.