హన్మకొండ చౌరస్తా, జూలై 18: నూతనంగా నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్పై ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రు స్టేడియంలో రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, డీవైఎస్వో అశోక్కుమార్తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హన్మకొండ, కరీంనగర్లో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. ట్రాక్ మధ్యలో గార్డెనింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని..ఆ దిశగా చొరవ చూపాలని చైర్మన్ మర్రి యాదవరెడ్డికి సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు పట్టేవిధంగా క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.