న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడిగా నరిందర్ బాత్రా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో శనివారం వర్చువల్ విధానంలో జరిగిన ఎఫ్ఐహెచ్ 47వ కాంగ్రెస్లో బాత్రా విజయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షునిగా కొనసాగుతున్న బాత్రా…ఎఫ్ఐహెచ్ ఎన్నికల్లోనూ తనదైన హవా కొనసాగించారు. ఫేవరెట్గా బరిలోకి దిగిన బాత్రా 63-61 ఓట్ల తేడాతో బెల్జియం హాకీ ఫెడరేషన్ చీఫ్ మార్క్ కౌడ్రన్పై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆన్లైన్ విధానంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో మొత్తం 124 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయానికి అవసరమైన 63 ఓట్లు దక్కించుకున్న బాత్రా 2024 వరకు అధ్యక్ష హోదాలో కొనసాగనున్నారు. 92 ఏండ్ల ఎఫ్ఐహెచ్ చరిత్రలో యూరోపియన్ కాకుండా అధ్యక్ష పదవి(2016లో)ని దక్కించుకున్న తొలి వ్యక్తిగా బాత్రా
అరుదైన రికార్డు నెలకొల్పారు.