నమీబియా తడబడుతోంది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోతోంది. వికెట్లను కూడా నిలుపుకోలేకపోతోంది. దీంతో 10 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు మాత్రమే చేసింది. నమీబియాను ఓపెనర్లు బార్డ్, మైకెల్ మాత్రమే ఆదుకున్నారు. బార్డ్ 21 బంతుల్లో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. మైకెల్ కూడా 15 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విలియమ్స్ డక్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ గెర్హార్డ్.. 11 బంతుల్లో కేవలం 4 పరుగులే చేశాడు. జాన్ నికోల్ 5 బంతుల్లో 5 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో గెర్హార్డ్, డేవిడ్ వీస్ ఉన్నారు. భారత బౌలర్లలో ఇప్పటి వరకు జడెజా 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్, బుమ్రా ఒక వికెట్ తీశారు.