నమీబియా కష్టాల్లో పడిపోయింది. భారత బౌలర్ల టఫ్ బౌలింగ్ను ఎదుర్కోలేకపోతోంది. 15 ఓవర్లకే 7 వికెట్లను నష్టపోయింది. అలాగే.. భారీ స్కోర్ కూడా చేయలేకపోయింది. 15 ఓవర్లలో 100 లోపే పరుగులు చేసింది. 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.
నమీబియా ప్లేయర్లలో వీస్ కాస్త పోరాడుతున్నాడు. 21 బంతుల్లో 21 పరుగులు చేశాడు. బార్డ్ కూడా 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మైకెల్ 14, గెర్హార్డ్ 12 పరుగులు, స్మిత్ 9 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజీ 3 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు.